హత్యాయత్నం అంటూ టీడీపీపై బురద జల్లుతున్నారు..: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు( N Chandrababu Naidu ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు.

 Mud Is Being Thrown At Tdp By Calling It An Assassination Attempt..: Chandrababu-TeluguStop.com

ఎన్నికల్లో ఓడిపోతామనే టీడీపీ నేతలపై వైసీపీ కుట్రలకు పాల్పడుతుందని చంద్రబాబు ఆరోపించారు.ఈ క్రమంలోనే తమ పార్టీ నేత బోండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించే కుట్ర జరిగిందని పేర్కొన్నారు.

తప్పు చేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలన్న చంద్రబాబు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు.

సీఎంపై రాయి దాడి ఘటనలో తప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు సింపతీ డ్రామాలకు వైసీపీ( YCP ) తెర తీసిందన్నారు.

హత్యాయత్నం అంటూ కావాలనే టీడీపీపై బురద వేయాలని చూస్తుందని ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో సీఎంకు భద్రత కల్పించడంలో విఫలమైన అధికారులను బాధ్యతల నుంచి తప్పించాలన్నారు.

అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఇతర అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube