రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.మండలంలోని నీలోజుపల్లి, వెంకటరావుపల్లి, కొత్తపేట, దేశయిపల్లి, విలాసాగర్ తో పాటు మండలకేంద్రం లోని రామాలయం లో శ్రీ సీత రాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు శ్రీనివాస చార్యులు ఆద్వర్యం లో సీత రామచంద్రుల ఉత్సావమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాలల మద్య ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి వేదపండితుల మంత్రోత్సరణ ల మధ్య సీత రాముల కల్యాణం నిర్వహించారు.
కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొజ్జప్రభాకర్ ,వైస్ చైర్మన్ భోయిని ఎల్లెష్ యాదవ్ ,మాజీ సర్పంచ్ గుంటి లతాశ్రీ శంకర్ , బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, నాయకులు లచ్చిరెడ్డి, డాక్టర్ అమిత్ కుమార్ ,మాజీ ఎంపీపీ సత్తినేని భాగ్యలత,ఆలయ కమిటీసభ్యులు ,మహిళలు గ్రామస్తులు ,హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.







