కాకినాడ( Kakinada ) జిల్లా పెద్దాపురంలో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది.ఈ మేరకు అక్రమంగా తరలిస్తున్న 8 కేజీలకు పైగా బంగారంతో పాటు 46 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన బంగారం, వెండి ఆభరణాల విలువ సుమారు రూ.5.60 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.ఎటువంటి అనుమతులు లేకుండా బంగారం, వెండి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బీవీసీ లాజిస్టిక్స్( BVC Logistics ) కు సంబంధించిన వాహనంలో కాకినాడ నుంచి విశాఖపట్నంకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.కాగా పెద్దాపురంలోని ఓ నగర దుకాణం నుంచి వెండి వస్తువులు తీసుకొని వెళ్తుండగా పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు.
అనంతరం లాజిస్టిక్స్ వాహనాన్ని ఆర్డీవో కార్యాలయానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.