రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం( Vemulawada Rural Mandal ) తూర్కాషినగర్ గ్రామం లో నాలుగు సీసీ కెమెరాల ను వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించటం జరిగిందనీ ఎస్ ఐ మారుతీ తెలిపారు.
ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ( Inspector Srinivas )మాట్లాడుతూ ప్రతీ గ్రామం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాల వల్ల దొంగతనాలు జరగకుండా ఉంటాయి అని,కెమెరాలు ఏర్పాటు వల్ల నేర నియంత్రణ జరుగుతుంది అని, నేర విచారణ లో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.







