పూతలపట్టు సభలో చంద్రబాబుపై సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

వైసీపీ అధినేత జగన్ “మేమంతా సిద్ధం”( Memantha Siddham ) బస్సుయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతోంది.ఈ సందర్భంగా పూతలపట్టులో నిర్వహించిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu Naidu )పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

 Cm Jagan Serious Comments On Chandrababu In Puthalapattu Meeting, Cm Jagan, Chan-TeluguStop.com

చంద్రబాబు అసలు మనిషా… శాడిష్టా.? అంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు.ఈ ఎన్నికలు జగన్.చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు.కుట్రలు, స్వతంత్రాలు చేసే వారంతా ఒకటవుతున్నాయి.ప్రజలను మోసం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతుంది.

ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, ప్రత్యేక హోదా( Special Status )ను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే.


ఓ వైపు విశ్వాసనీయత మరోవైపు మోసం అబద్ధం ఉన్నాయి అంటూ సీఎం జగన్( CM YS Jagan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక్కడిపై పోరాడటానికి ఇంతమంది ఏకమవుతున్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది ఎవరు.? చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా.? రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరు.? విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ నీ ఏర్పాటు చేసింది ఎవరు.? పేదలు పిల్లలు రైతులు అవ్వతాతలు మైనారిటీలు అందరి తరపున నిలబడేందుకు అంతా సిద్ధమేనా.? జరగబోయే ఎన్నికల్లో( Upcoming Elections ) రాష్ట్రం ముందు రెండు ప్రత్యమ్నాయాలు ఉన్నాయి.ఎవరి హయాంలో మంచి జరిగిందా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.మీరు వేసే ఓటు వల్ల తలరాతలు మారతాయని గుర్తుపెట్టుకోండి.175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలిపించి డబుల్ సెంచరీ సర్కార్ ఏర్పాటు చేయటానికి అంతా సిద్ధమేనా.? అంటూ సీఎం జగన్ సంచలన స్పీచ్ ఇచ్చారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube