రాధిక శరత్ కుమార్( Raadhika Sarathkumar ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నటిగా రాధిక ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు.
రాధిక ఎక్కువ సంఖ్యలో సీరియళ్లలో నటించడంతో పాటు కొన్ని సీరియళ్లకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) రాధికా శరత్ కుమార్ పోటీ చేస్తుండగా ఆమె తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.
తమిళనాడులోని విరుదునగర్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.తన మొత్తం ఆస్తుల విలువ 53.45 కోట్ల రూపాయలు( Raadhika Sarathkumar Assets Value ) అని రాధిక ప్రకటించారు.33 లక్షల రూపాయల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి 27.05 కోట్ల రూపాయల చరాస్థులు ఉన్నట్టు ఆమె తెలిపారు.నామినేషన్ లో రాధిక వెల్లడించిన ఈ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.26.4 కోట్ల రూపాయల స్థిరాస్థులు ఉన్నాయని ఆమె తెలిపారు.

అదే సమయంలో 14.79 కోట్ల రూపాయల అప్పులు( Raadhika Sarathkumar Debts ) ఉన్నట్టు రాధిక వెల్లడించారు.రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు ఆమె ఎండీగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు.రాధిక భర్త శరత్ కుమార్( Sarathkumar ) తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని బీజేపీలో విలీనం చేశారు.
ఈ క్రమంలో బీజేపీ నుంచి రాధికకు టికెట్ దక్కడం గమనార్హం.

ఏప్రిల్ నెల 19వ తేదీన తొలి దశలోనే ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది.రాధికకు పోటీగా కెప్టెన్ విజయ్ కాంత్ కుమార్ విజయ ప్రభాకరన్ బరిలోకి దిగారు.తనకు 17.95 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని విజయ్ ప్రభాకరన్( Vijaya Prabhakaran ) ప్రకటన చేశారు.ఎన్నికల్లో రాధిక ఎంపీ అభ్యర్థిగా విజయం సాధిస్తారో లేదో చూడాలి.
రాధిక శరత్ కుమార్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.ఎన్నికల్లో గెలుపు సొంతమవుతుందని రాధిక కాన్ఫిడెన్స్ తో ఉన్నారని భోగట్టా.







