జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ( National Dam Safety Authority Committee ) మరోసారి తెలంగాణకు రానుంది.ఈ మేరకు ప్రాజెక్టుల్లో లోపాలను గుర్తించి విచారణ జరిపేందుకు అధికారుల బృందం రానుంది.
ఈ క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజీతో( Medigadda Barriage ) పాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు లోపాలపై డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ మరోసారి విచారణ జరపనుంది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని జలసౌధలో చంద్రశేఖర్ అయ్యర్( Chandrasekhar Iyer ) నేతృత్వంలో అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.