మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి( Former MLA Saidireddy ) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.పార్టీ మార్పుతో పాటు బీజేపీలో చేరిక వ్యవహారంపై పార్టీ క్యాడర్ కు ఆయన నచ్చజెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన అవతలి వారికి మన నేతలే మద్ధతు ఇస్తారని సైదిరెడ్డి పేర్కొన్నారు.ఎన్నికలప్పుడు డబ్బులు ఇవ్వకుండా అవతల వారికి ఇస్తే ఎలా పని చేస్తామని ప్రశ్నించారు.
ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదన్నారు.రంజిత్ రెడ్డి, ఫైళ్ల శేఖర్ రెడ్డి ( Ranjith Reddy, Filesekhar Reddy )వంటి నేతలే పోటీ చేయడం లేదని చెప్పారు.
అటు సీఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) దింపాలని కాంగ్రెస్ వాళ్లే అనుకుంటున్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ ఉందన్న సైదిరెడ్డి రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.







