జిల్లా కేంద్రంలోని ఐదో వార్డు సువెన్ ఫార్మసీ కంపెనీ( Suven Pharma Company )లో శనివారం భరోసా సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడి టీచర్లు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు నాగలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లకు( Anganwadi Teachers ) వేతనాలు పెంచాలని,వేసవి సెలవులు ఇవ్వాలని మంత్రిని కోరినట్టు తెలిపారు.
వారి వినతిని సావధానంగా విన్న మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సెక్టార్ అధ్యక్షురాలు శారద,అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.