ఇటీవల మేరీ అనే రష్యన్ మహిళ( Russian lady ) ఇండియాకి వచ్చి కూరగాయలు ఎలా అమ్మాలో నేర్చుకుంది.దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది.
ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఆ వీడియో వైరల్ గా మారింది.దానిని చాలా మంది లైక్ చేసారు, కామెంట్ చేశారు.

వీడియోలో బంగాళదుంపలు, ఉల్లిపాయలు( Potatoes , Onions ) అమ్మే వ్యక్తికి మేరీ హలో చెప్పడం మనం చూడవచ్చు.హిందీలో కూరగాయలు అమ్మడం ఎలాగో నేర్పించమని ఆమె అతనిని అడుగుతుంది.నేర్పించడానికి అతను అంగీకరించాడు.అలా వారు ఒక రోజు కలిసి పని చేస్తారు.కస్టమర్లకు చెప్పడానికి “బంగాళదుంపలు కొనండి, ఉల్లిపాయలు కొనండి” వంటి కొన్ని ఆకర్షణీయమైన పదబంధాలను అతను ఆమెకు నేర్పిస్తాడు.మేరీ ఈ మాటలను అందమైన యాసతో రిపీట్ చేస్తుంది.
ప్రజలను నవ్విస్తుంది.ఆమె కొన్ని బంగాళదుంపలను ఎరుకుని ఎంచుకునే కస్టమర్కు కూడా విక్రయిస్తుంది.

మేరీ( Marie ) ఆ రోజు గురించి తన ఆలోచనలను వీడియోలో పంచుకుంది.మార్కెట్ చాలా బిజీగా, సందడిగా ఉందని, కానీ చాలా అందంగా ఉందని చెప్పింది.భారతదేశంలో బేరసారాలు చాలా ముఖ్యమైనవని కూడా ఆమె చెప్పింది.ఇది సంస్కృతిలో భాగం, వస్తువులను కొనుగోలు చేయడం సరదాగా ఉంటుందని పేర్కొంది.కస్టమర్లు తన నుంచి తక్కువ ధరలను పొందడానికి ఎలా ప్రయత్నించారో కూడా ఆమె చెప్పింది.కొన్నిసార్లు ఆమెకు అర్థంకాదని భావించి ఆమెతో ఇంగ్లీషులో మాట్లాడతారు.
అయితే బేరసారాలు తనకు తెలుసునని, వారిని మోసం చేయనివ్వనని చెప్పింది.చాలా మంది వ్యక్తులు మేరీ వీడియోను చూసి ఫిదా అయ్యారు.
కొందరు ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.ఆమె ధైర్యవంతురాలు అని చెప్పారు.
భారతదేశంలోని ఇతర ప్రదేశాలను సందర్శించమని కూడా వారు ఆమెను ఆహ్వానించారు.







