రాజాన్న సిరిసిల్ల జిల్లా : గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ( Congress party )తోనే సాధ్యం అని చందుర్తి జెడ్పిటిసి నాగం కుమార్ అన్నారు.చందుర్తి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆవరణంలో జడ్పి నిథులతో లక్ష 50వేల రూపాయలతో బోరు మోటర్కు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా జడ్పీటిసి నాగం కుమార్ ( ZPTC Nagam Kumar )మాట్లాడుతూ…
కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt) అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహాకారంతో నిధులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా జెడ్పిటిసి తో పాటు పలువురిని ముదిరాజ్ సంఘ సభ్యులు శాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, నాయకులు గొట్టే ప్రభాకర్, పులి సత్యం గౌడ్, దూది శ్రీనివాసరెడ్డి, కనుక రాజ్, మధు,పిట్టల బాబు, రవి ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.