టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.
ఈ మేరకు 15వ నంబర్ కోర్టులో 44వ ఐటెంగా చంద్రబాబు కేసు లిస్ట్ అయింది.

స్కిల్ డెవలప్మెంట్ కేసు( Skill development case )లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు( AP High Court ) ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేయనుంది.







