కడప జిల్లా యోగివేమన యూనివర్సిటీ( Yogivemana University )లో ఫుడ్ పాయిజన్ అయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.యూనివర్సిటీలో సుమారు 24 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.నిన్న రాత్రి తిన్న ఆహారం వలనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం.బాధిత విద్యార్థినులకు జిల్లాలోని రిమ్స్ ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ఓ ప్రైవేట్ ఆస్పత్రి( Private hospital )లో చికిత్స అందిస్తున్నారు.