Pallavi Prashanth : 35 లక్షలు గెలిచిన ప్రశాంత్ రైతుల కోసం ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా?

బిగ్ బాస్( Bigg Boss )కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) ఒకరు.కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ తన అద్భుతమైన ఆట తీరుతో రోజురోజుకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Pallavi Prashanth Respond Over Bigg Boss Prize Money-TeluguStop.com

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతూ చివరికి టైటిల్ రేస్ కి చేరుకున్నారు.అనూహ్యంగా ఈ కార్యక్రమంలో పల్లవి ప్రశాంత్ విన్నర్ (Winner) గా నిలిచారు.

ఇక ఈ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలోనే బిగ్ బాస్ విన్నర్ గా గెలిస్తే ఆ డబ్బుతో ఎవరు ఏం చేస్తారనే విషయం గురించి బిగ్ బాస్ అందరిని అడిగారు.

ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత బిగ్ బాస్ లో తాను విన్నర్ గా నిలిచిన తరువాత వచ్చిన ప్రైజ్ మనీ( Prize Money ) మొత్తం పేద రైతులకే పంచుతానని తెలిపారు.ఇక ఈ కార్యక్రమంలో గెలిసినందుకు పల్లవి ప్రశాంత్ కు 15 లక్షల డైమండ్ నెక్లెస్ 15 లక్షల విలువ చేసే కారు బహుమతిగా ఇచ్చారు.యావర్ 15 తీసుకొని బయటకు రావడంతో పల్లవి ప్రశాంత్ కు ప్రైజ్ మనీ కేవలం 35 లక్షల రూపాయలు మాత్రమే వచ్చింది.

ఇక బిగ్ బాస్ ద్వారా గెలిచిన డబ్బుతో రైతులకు సహాయం చేస్తానని చెప్పినటువంటి ఈయన ఇప్పటివరకు డబ్బులు రైతులకు పంచకపోవడంతో ఇచ్చిన మాట తప్పారు అంటూ ఈయన పై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి.తాజాగా ఈ విమర్శలపై పల్లవి ప్రశాంత్ స్పందించారు.నా ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పననీ తెలిపారు.త్వరలోనే బిగ్ బాస్ ద్వారా గెలిచిన ఆ డబ్బులు రైతులకు పంచబోతున్నానని తెలిపారు.అయితే ఈయన గెలిచిన 35 లక్షల రూపాయలలో ట్యాక్స్ పోయి కేవలం తనకు 16 లక్షలు మాత్రమే వచ్చిందని ఆ 16 లక్షలు రైతులకు పంచబోతున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube