గుంటూరులో జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) పై క్రిమినల్ కేసు నమోదు అయింది.వాలంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జనసేనాని పవన్ పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వాలంటీర్ గుంటూరు కోర్టు( Guntur Court )ను ఆశ్రయించారు.ఈ క్రమంలో పవన్ ను వచ్చే నెల 25న పవన్ కల్యాణ్ విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే గత ఏడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై( Volunteers ) పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న సంగతి తెలిసిందే.