ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చక్కర్లు కొడుతుంది.ఆ వీడియోని తమిళనాడుకు చెందిన ఒక బస్సు డ్రైవర్ రికార్డ్ చేసాడు.
IAS అధికారిణి సుప్రియా సాహు( IAS Supriya Sahu ) ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా దీనిని షేర్ చేశారు.ఈ వీడియోలో బస్సులోని ప్రయాణీకులు భయపడుతున్నట్లు మనం చూడవచ్చు.
ఆ బస్సు డ్రైవర్ మాత్రం చాలా కామ్ గా ఉన్నాడు.కామ్ గా మాట్లాడుతున్నాడు.
అంతేకాదు, ఏనుగును అన్న అంటూ ఆప్యాయంగా పిలిచాడు.బీఆర్టీ టైగర్ రిజర్వ్లోని పుంజనూర్ రేంజ్ పరిధిలోని తమిళనాడు-కర్ణాటక సరిహద్దు సమీపంలోని కరపల్లం చెక్పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది.

కరపల్లం చెక్పోస్ట్( Karapallam Checkpost ) మార్గంలో బస్సు వెళ్తుండగా అదే మార్గంలో బస్సుకి ఎదురుగా ఒక ఏనుగు కూడా వచ్చింది.దీంతో ఆ బస్సు డ్రైవర్ కంగారు పడకుండా వెంటనే పరిస్థితిని అంచనా వేసి, బస్సును అక్కడే రోడ్ మీదనే ఆపి, తన ప్రయాణీకులను భయపడకుండా ప్రశాంతంగా ఉండమని కోరాడు.అంత దగ్గరలో ఏనుగు( Elephant ) ఉండటంతో ప్రయాణికులు చాలా భయపడిపోయారు.అది దాని చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించినప్పుడు అందరికీ చెమటలు పట్టేసాయి.కానీ డ్రైవర్ గొంతు వారికి మనం సురక్షితం అనే ఓ భరోసా ఇచ్చింది.బస్సులోని ప్రయాణికులను ఏం చప్పుడు చేయకపోవడంతో ఆ ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అది వెళ్లిపోయేవరకు డ్రైవర్( Bus Driver ) కంగారు లేకుండా బస్సు ని అలానే నిలిపివేశాడు.

ఆ వీడియో చూసిన IAS ఆఫర్ బస్సు డ్రైవర్ ను ‘మిస్టర్ కూల్'( Mr.Cool ) అని పిలిచారు.ఏనుగు దాటిపోయే వరకు డ్రైవర్ ఓపికగా వేచి ఉన్నాడని ఆమె చెప్పారు.
అతను ఏనుగును “అన్నా” అని సంబోధించాడు.అలా సౌమ్యంగా మాట్లాడుతూ బస్సును నైపుణ్యంగా నడిపిస్తూ వీడ్కోలు పలికాడు.
ఈ బ్యూటిఫుల్ వీడియోను మూర్తి అనే ప్రయాణీకుడు రికార్డ్ చేశాడు.ఈ వీడియో చూసిన నేటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
డ్రైవర్ ప్రవర్తనను ప్రశంసించి అతన్ని గౌరవించాలని కామెంట్స్ చేస్తున్నారు.







