ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వైసీపీ సర్కార్ చెత్త ప్రభుత్వమని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కనీసం సురక్షితమైన మంచినీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని విమర్శించారు.

సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) కు ఈ మధ్య సినిమా పిచ్చి మొదలైందని ఎద్దేవా చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ( YCP ) శ్రేణులే రోడ్లపైకి వచ్చి జగన్ అన్యాయం చేశారని వాపోతున్నారని తెలిపారు.సామాజిక న్యాయమని చెబుతూ జగన్ సామాజిక అన్యాయం చేశారని వెల్లడించారు.
అంతేకాకుండా బీసీలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.







