Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హైడ్రామా..!

తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్( Telangana Assembly Media point ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను మార్షల్స్ అడ్డుకున్నారు.

 Hydrama At Telangana Assembly Media Point-TeluguStop.com

సభ జరుగుతుండగా మాట్లాడొద్దని మార్షల్స్ సూచించారు.కాగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కంచెలు తొలగిస్తామని అసెంబ్లీలో కంచెలు ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు( BRS MLAs ) ప్రశ్నించారు.అసెంబ్లీలో గొంతు నొక్కుడే.బయట గొంతు నొక్కుడేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు( BRS MLA Harish Rao ) విమర్శించారు.

గతంలో ఈ స్థాయిలో పోలీసుల భద్రత లేదన్న ఆయన ఎన్నో కంచెలు అసెంబ్లీలోకి కొత్తగా వచ్చాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube