రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ యువకులకు మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య( ZPTC Kodi Antaiah ) క్రికెట్ పోటీలను ఏర్పాటు చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కోడి అంతయ్య వెల్లడించారు.
యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యతోపాటు క్రీడల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్,క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.







