లోక్సభ ఎన్నికలు( Lok Sabha elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) నివాసంలో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.

లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.ఒక్కో లోక్ సభ స్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురు పేర్లను పరిశీలించనున్నారు.అదే విధంగా బీసీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయంపై బీజేపీ నేతలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ ను ఈటల రాజేందర్, మురళీధర్ రావు, కూన శ్రీశైలం గౌడ్ తో పాటు చాడా సురేశ్ రెడ్డి ఆశిస్తున్నారు.అలాగే మహబూబ్ నగర్ టికెట్ ను జితేందర్ రెడ్డి( Jithender Reddy )తో పాటు డీకే అరుణ కూడా ఆశిస్తున్నారని తెలుస్తోంది.







