ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ( BJP ) త్వరలోనే ఎన్డీఏలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.బీజేపీ అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు( Chandrababu naidu ) పార్టీ అగ్రనేతలతో సమావేశం అయిన సంగతి తెలిసిందే.
బీజేపీ రాష్ట్ర నాయకత్వం మరియు జనసేనతో చర్చలు జరిపిన తరువాత ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అయితే చంద్రబాబును ఎన్డీఏలోకి రావాలని బీజేపీ( BJP ) ఆహ్వానించింది.
కాగా ఇప్పటికే దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం కమలం పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.నిన్న అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమైన చంద్రబాబు ఏపీ రాష్ట్ర పరిస్థితులను వివరించారు.ఈ క్రమంలోనే టీడీపీ, బీజేపీ, జనసేన బలాబలాలతో పాటు గెలుపు అవకాశాలను చంద్రబాబు వివరించారని సమాచారం.కాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన( Chandrababu Delhi Tour ) ముగిసింది.