బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై( Ex MLA Shakeel ) లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.ఇటీవల హైదరాబాద్ లోని ప్రజాభవన్( Prajabhavan ) ముందు జరిగిన రోడ్డుప్రమాదం కేసులో షకీల్ ఏ3గా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే మాజీ ఎమ్మెల్యే షకీల్ తో పాటు రాహిల్( Raheel ) దుబాయ్ లో ఉన్నట్లు సమాచారం అందిందని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు.ఈ నేపథ్యంలోనే షకిల్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే రాహిల్ పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే డిసెంబర్ 23వ తేదీ అర్థరాత్రి సమయంలో ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను షకీల్ కుమారుడు కారు ఢీకొట్టింది.మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.