తెలంగాణలో పద్మ అవార్డులకు( Padma Awardees ) ఎంపికైన తెలుగు తేజాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఘనంగా సత్కరించనుంది.శిల్పకళావేదికలో తెలంగాణ ప్రభుత్వం( Telangana Government ) సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవితో( Megastar Chiranjeevi ) పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని( Venkaiah Naidu ) సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సత్కరించనున్నారు.

సినీ కళామతల్లికి అందించిన సేవలకు గానూ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్( Padma Vibhushan ) పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.అలాగే పద్మ అవార్డులకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, కూరెళ్ల విఠలాచార్య, వేలు ఆనందాచారి, కేతవాత్ సోమ్ లాల్ లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్మానించనుంది.







