కాంగ్రెస్( Congress ) ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కేస్లాపూర్ లోని నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దర్బార్ హాలులో మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాలక్ష్మీ పథకంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తే బీఆర్ఎస్ కు ఎందుకంత కడుపుమంటని ప్రశ్నించారు.ఇందిరమ్మ పాలనలో మహిళా సంక్షేమమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.మహిళలకు త్వరలోనే కుట్టు మిషన్లను అందిస్తామని వెల్లడించారు.







