దాసరి నారాయణరావు( Dasari Narayana Rao )… తాత మనవడు అనే చిత్రంతో తొలిసారిగా 1972లో దర్శకుడుగా మారారు దాసరి.అయితే కమర్షియల్ సినిమాలు తీయడంలో దాసరి దిట్ట.
కానీ అన్ని సార్లు కమర్షియల్ సినిమాలనే ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడరు సినిమా చాలా పెద్ద హిట్ అయిన తర్వాత దానికి సంబంధించిన వంద రోజులు వేడుక విజయవాడలో జరిగింది.ఆ టైంలో అక్కడ జనంలో ఉన్న కొంత మంది శంకరా భరణం లాంటి ఒక క్లాసిక్ సినిమా తీయడం దాసరి ఇలాంటి దర్శకుడికి అయ్యే పని కాదు అంటూ కామెంట్ చేశారట.
ఆ మాటలు దాసరి చెవి వరకు చేరాయి.దాంతో చాలా హర్ట్ అయ్యారట దాసరి.
తను ఎందుకు ఒక క్లాసిక్ సినిమా చేయకూడదు అనే తర్జన భర్జన కు గురయ్యారట.

ఆ మథనం నుంచి వచ్చిందే మేఘసందేశం చిత్రం( Meghasandesham ).సరిగ్గా అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు తన 200 సినిమా చేయడానికి దాసరిని పిలిపించారట.ఎంతో ప్రెస్టేజ్ గా తీయాల్సిన అలాంటి ఒక చిత్రాన్ని దాసరికి అప్పచెప్పారట కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా వద్దని ఏదైనా భిన్నంగా ఆలోచించమని చెప్పారట దాంతో మేఘసందేశం అనే చిత్రానికి బీజం పడింది.
మేఘసందేశం చిత్రం విశ్వనాథ్( Vishwanath ) తీసిన శంకరాభరణం చిత్రాన్ని పోలి ఉంటుంది.శంకరాభరణం ( Shankarabharanam )సినిమాలో శంకర శాస్త్రి తులసి అనే ఒక వేశ్య ల మధ్య కథ నడుస్తుంది.

మేఘసందేశం సినిమాలో అక్కినేని మరియు దేవదాసు వృత్తికి చెందిన జయ ప్రదల మధ్య కథ నడుస్తుంది.అక్కడ తులసికి ఇక్కడ జయప్రదకు నాట్యం సంగీతం అంటే ప్రాణం అలాగే అక్కడ అక్కినేని జయప్రద నా బంధాన్ని అందరూ ఆహ్వానిస్తే జయప్రద ఊరు వదిలి వెళ్ళిపోతుంది ఇక్కడ తులసి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఇలా దాదాపు అన్ని పాత్రలు కంటెంట్ కూడా సమానంగానే ఉంటాయి కానీ శంకరాభరణం అంత స్థాయి హిట్ ఈ సినిమా కాలేదు.పైగా ఈ సినిమాకు దాసరి నిర్మాతగా కూడా వ్యవహరించారు.అలా ఇలాంటి దర్శకుడు తో పోటీ పెట్టుకుని దాసరి ఊడిపోయారని చెప్పొచ్చు.







