మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.ఎందుకంటే ఈ సినిమా త్రివిక్రమ్ చేసిన రొటీన్ సినిమాల మాదిరిగానే ఉండడంతో ఈ సినిమాని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయడంలో చాలావరకు డిసప్పాయింట్ అయిందనే చెప్పాలి.
ఇక ఇలాంటి సమయంలో త్రివిక్రమ్( Trivikram ) తన నెక్స్ట్ సినిమాని అల్లు అర్జున్తో చేయడానికి రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు ఇంతకు ముందు నార్మల్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం దాన్ని పకడ్బందీ స్క్రిప్ట్ గా మార్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
గుంటూరు కారం( Guntur Kaaram ) ఫ్లాప్ తో తనని తాను మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే తన స్క్రిప్ట్ లో గాని తన డైరెక్షన్ లో గాని చాలా వేరియేషన్స్ ని చూపిస్తూ సినిమా టేకింగ్ ఎలా చేయాలనే ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.అందుకే అల్లు అర్జున్ ( Allu Arjun )కోసం ఇంతకు ముందు రాసుకున్న కథను పక్కన పెట్టి ఒక కొత్త కథతో తనతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి కావలసిన మేకోవర్ లోకి షిఫ్ట్ అవుతున్నట్టు గా తెలుస్తుంది.ఇక అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరోతో మరోసారి ఇండస్ట్రీ హిట్టు కొట్టాలని త్రివిక్రమ్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి.
నాలుగో సక్సెస్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.ఇక అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ తో సినిమా అంటే ఆ సినిమా చేయడానికి ఆయన ఎప్పుడు ముందుంటాడు…
.







