దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) నిర్మించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది.సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.

ఈ క్రమంలోనే మూడు వారాల్లో మళ్లీ రివ్యూ చేసి రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ సినిమా రిలీజ్ కు అనుమతి ఇవ్వాలంటూ చిత్ర నిర్మాత దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ రోజుకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి బ్రేక్ వేసింది.







