తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటి శ్రియా దర్శించుకుంది.ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని, హుండీలో కానుకలు సమర్పించి శ్రియా మ్రొక్కుల చెల్లించుకుంది.
ఈ సందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదా శీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన అందాలనటి శ్రియా తో పలువురు ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.







