బీఆర్ఎస్ పై లండన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు కూడా లేకుండా చేస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులో పాతిపెడతానంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

ఒక్క ఎన్నికకే బొక్కబోర్లా పడ్డారన్న ఆయన అధికారం పోయినా బీఆర్ఎస్ కు అహంకారం తగ్గలేదని విమర్శించారు.ఈ క్రమంలోనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను ఓడించి అహంకారం తగ్గిస్తామని తెలిపారు.







