ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.జగన్ బెయిల్ ను రద్దు చేసి కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.దీనికి తాము బాధ్యులం కాదని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.
అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్ కు వాయిదా వేసింది.