మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
హామీలను నెరవేర్చనందుకే బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించారని మంత్రి జూపల్లి తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ఆరోపించారు.
అలాగే బీఆర్ఎస్ నేతలకు కుట్రలు, కుతంత్రాలు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తుందన్నారు.
అధికారంలోకి రాగానే రెండు హామీలను అమలు చేశామన్నారు.గతంలో పార్టీకి నష్టం జరిగినా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని వెల్లడించారు.







