కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్( Srinivas ) కు మాజీ ఎంపీ హర్షకుమార్ మద్ధతు ప్రకటించారు.ఇందులో భాగంగా ఆయన నివాసం వద్ద సంఘీభావ దీక్ష చేపట్టారు.
వైఎస్ జగన్( YS Jagan ) పై శ్రీనివాస్ కోడికత్తితో ఉద్దేశ పూర్వకంగా దాడి చేయలేదని హర్షకుమార్ పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులే చెప్పారన్నారు.ఏళ్లకు ఏళ్లు జైల్లోనే ఉంటున్న శ్రీనివాస్ పై జగన్ వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో తక్షణమే కోడికత్తి కేసులో శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరోవైపు శ్రీనివాస్ జైల్లో దీక్ష చేయడం లేదని జైలు అధికారులు తెలిపారు.