గుంటూరు కారం( Guntur Karam ) సినిమాకు రిలీజ్ రోజున మిక్స్డ్ టాక్ వచ్చింది.ఫ్యాన్స్ నుంచి కూడా ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రాకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందని కొంతమంది భావించారు.
అయితే సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కావడం, సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటించడం ఈ సినిమాకు ప్లస్ అయింది.కలెక్షన్ల విషయంలో గుంటూరు కారం మూవీ అదుర్స్ అనిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.
మహేష్ బాబు కాకుండా మరొకరు నటించి ఉంటే గుంటూరు కారం సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్లు వచ్చేవి కావు.
గుంటూరు కారం సినిమా రీజినల్ సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.శ్రీలీల( Sreeleela ) వరుస ఫ్లాపులకు సైతం ఈ సినిమాతో బ్రేక్ పడింది.
ఎంతోమంది చిన్నపిల్లలకు ఆపరేషన్లు చేయించి మంచి మనస్సును చాటుకున్న మహేష్ కు భారీ హిట్ దక్కాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.
గుంటూరు కారం మూవీ ఈ ఏరియా, ఆ ఏరియా అని సంబంధం లేకుండా అన్ని ఏరియాలలో అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను( Guntur Karam Collections ) సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై( Trivikram Srinivas ) మాత్రం విమర్శలు చేస్తున్నారు.రొటీన్ కథలకు కాలం చెల్లిందని త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.హారిక హాసిని నిర్మాతలకు మాత్రం గుంటూరు కారం సినిమాతో నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే లేదు.ఈ సినిమా వల్ల నిర్మాతలు మాత్రం సేఫ్ అయ్యారని సమాచారం అందుతోంది.మహేష్ జక్కన్న మూవీ కోసం మరో మూడేళ్ల పాటు ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది.