నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో స్నేహితుడిని ఓ యువకుడు హత్య చేశాడు.
రాకేశ్, సూర్య అనే వ్యక్తులు గత కొంతకాలంగా స్నేహితులుగా ఉంటున్నారు.అయితే తన భార్యతో రాకేశ్ చనువుగా ఉండటాన్ని చూసి సూర్య పలుమార్లు హెచ్చరించాడని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రాకేశ్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడే అనుమానంతో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు.సూర్య చేసిన దాడిలో రాకేశ్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు వదిలాడు.
మరోవైపు రాకేశ్ కుటుంబ సభ్యులు నిందితుడు సూర్య ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







