తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.గ్రేటర్ హైదరాబాద్ లో ఫ్యామిలీ -24, టి-6 టికెట్లను ఉపసంహరించుకుంది.
ఈ మేరకు టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
రాష్ట్రంలో మహాలక్ష్మీ పథకం అమలు నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఫ్యామిలీ -24, టి-6 టికెట్లను ఉపసంహరించుకుంది.
కాగా ఈ నిలుపుదల జనవరి ఒకటో తేదీ నుంచి అమలు కానుందని సజ్జనార్ వెల్లడించారు.సాధారణంగా ఫ్యామిలీ -24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాల్సి ఉంటుంది.
అలాగే వయసును నమోదు చేయాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే.







