ఏపీలో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.ఈ మేరకు పోస్టులను భర్తీ చేసేందుకు ఇంటర్ విద్యాశాఖ తరపున ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
వచ్చే నెల 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ పోస్టులకు దరఖాస్తులను ఏపీపీఎస్సీ స్వీకరించనుంది.ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 47 జూనియర్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనుంది.
ఏప్రిల్, మేలో రాతపరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సంబంధిత వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపింది.







