ఏపీలో పొత్తులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు క్లారిటీ ఇచ్చారు.పొత్తులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
ఎన్నికల సమయంలో పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్న ఎంపీ జీవీఎల్ బీజేపీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తుందని వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో అధికార పార్టీ తమపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ను ఎందుకు కలిశారో వారే చెప్పాలన్నారు.అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్ లో తాను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు.అందుకు అనుగుణంగానే ఒప్పందాలు జరుగుతున్నాయని జీవీఎల్ వెల్లడించారు.
అయితే ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలకు ప్లాంట్ అమ్మకానికి సంబంధం లేదని తెలిపారు.







