పల్లవి ప్రశాంత్.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు వినిపిస్తోంది.ఎవరి నోట విన్నా కూడా ఈ పేరే వినిపిస్తోంది.ఇటీవల తెలుగులో ముగిసిన బిగ్బాస్ సీజన్ సెవెన్ లోకి ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి బిగ్బాస్ విన్నర్ గా నిలవడంతో అతన్ని ప్రశంసలతో ముంచేత్తారు.
అంతవరకు బాగానే ఉన్నా పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత అభిమానులు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాంతో అభిమానులు చేసిన పనికి టైటిల్ గెలిచిన ఆనందం పల్లవి ప్రశాంత్ కి అస్సలు దక్కలేదు.
ఊహించని విధంగా అరెస్ట్ అయ్యాడు ప్రశాంత్.డిసెంబర్ 17 రాత్రి అన్నపూర్ణ స్టూడియో ఎదుట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు.
పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీస్ ని ధ్వంసం చేశారు.బయట గొడవగా ఉందని పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వెనుక డోర్ నుండి పంపించారు.అయితే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు. దీంతో పల్లవి ప్రశాంత్ పై పోలీసులు పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు.
బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్ ని పోలీసులు తన స్వగ్రామంలో అరెస్ట్ చేశారు.కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ ను విధించింది.
పల్లవి ప్రశాంత్ ని బయటకు తీసుకురావాలని లాయర్లు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు.ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై మాజీ కంటెస్టెంట్స్ తో పాటు సీజన్ 7 కంటెస్టెంట్స్ కూడా స్పందిస్తున్నారు.
భోలే షావలి అరెస్ట్ విషయం తెలుసుకుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.అలాగే మీడియాతో మాట్లాడుతూ అతడికి లా అండ్ ఆర్డర్ గురించి తెలియదు.

అభిమానులను చూసి ఆనందంలో ర్యాలీ చేశాడు.అత్యుత్సాహంలో జరిగిన పొరపాట్లు తప్పితే కావాలని చేసింది లేదు అని అన్నాడు.హౌస్ లో ఎంతో కష్టపడి ఆడాడు.ప్రశాంత్ ని వదిలేయాలని భోలే షావలి అన్నారు.అలాగే మరో కంటెస్టెంట్ అశ్విని శ్రీ కూడా స్పందిస్తూ ఎంతో ఆవేదన చెందారు.అశ్విని శ్రీ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించింది.
ఫ్యాన్స్ చేసిన తప్పుకు పాపం పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం ఏమిటీ? ఇది చాలా తప్పు? అంటూ మండిపడింది.నాకు మాటలు కూడా రావడం లేదు.
వాడు చాలా మంచి వాడు, అమాయకుడు.దయ చేసి నా తమ్ముడిని బయటకు తీసుకురండి అంటూ చేతులు జోడించి వేడుకుంది.
ప్రస్తుతం అశ్విని శ్రీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే బిగ్ బాస్ ఫైనల్ రోజు అశ్విని శ్రీ కారు అద్దాలు కూడా పగలగొట్టారు.
ఆమె చాలా ఆవేదన చెందారు.ఆ పని చేసింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని ప్రచారం అయితే జరిగింది.
అయినప్పటికీ అశ్విని శ్రీ పల్లవి ప్రశాంత్ కి ఎంతో మద్దతుగా నిలిచింది.







