తాజాగా బిగ్ బాస్ తెలుగు 7( Bigg Boss Telugu 7 ) ఘనంగా ముగిసింది.టైటిల్ విన్నర్ గా కామన్ మ్యాన్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) గెలిచాడు.
దీంతో ప్రేక్షకులు హంగామా మామూలుగా లేదు.అయితే ముందు నుంచి అనుకుంటున్న విధంగానే ఈసారి విన్నర్ గా రైతుబిడ్డ నే గెలవడంతో ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సాధారణ వ్యక్తుల బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇంతటి విజయాన్ని సాధించడంతో అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.అయితే బిగ్ బాస్ హౌస్ లోకి నటుడు శివాజీ( Shivaji ) కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక బిగ్ బాస్ షో ముగియక ముందు వరకు తప్పకుండా శివాజీ గెలుస్తాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి.
![Telugu Nagarjuna, Shivaji-Movie Telugu Nagarjuna, Shivaji-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/12/shivaji-releases-a-video-made-interesting-comments-on-bigg-boss-telugu-7-winner-pallavi-prashanth-and-nagarjunaa.jpg)
ఈసారి టైటిల్ శివాజీదే అని జనాలు ఫిక్స్ అయ్యారు.చివరి వారాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.పల్లవి ప్రశాంత్ పుంజుకున్నాడు.
అతడికి ఓటింగ్ పెరుగుతూ వచ్చింది.మొదట్లో శివాజీ, ప్రశాంత్ నామినేషన్స్ లో ఉంటే అత్యధిక ఓటింగ్ శివాజీకి పడేది.
తర్వాత స్థానంలో ప్రశాంత్ ఉండేవాడు.షో ముగింపు దశకు చేరుకుంటుండగా ప్రశాంత్ అందరికంటే అత్యధిక ఓట్లు సాధించేవాడు.
మిగతా వాళ్ళతో అతనికి పోటీ లేకుండా పోయింది.ప్రశాంత్ శివాజీ శిష్యుడిగా హౌస్లో మెలిగాడు.
శివాజీ, ప్రశాంత్, యావర్ స్పై టీమ్ గా పేరుగాంచారు.శివాజీని స్టార్ మా తొక్కేసింది.
అతన్ని కాదని పల్లవి ప్రశాంత్ కి టైటిల్ కట్టబెట్టారని ప్రచారం జరుగుతుండగా శివాజీ ఒక వీడియోనీ విడుదల చేశారు.
![Telugu Nagarjuna, Shivaji-Movie Telugu Nagarjuna, Shivaji-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/12/shivaji-releases-a-video-made-interesting-comments-on-bigg-boss-telugu-7-winner-pallavi-prashanth-and-nagarjunab.jpg)
ఆ వీడియోలో శివాజీ మాట్లాడుతూ.సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) చెప్పారు.మా నటులకు ప్రేక్షకులే దేవుళ్ళు.
జీవితంలో నటిస్తే ఎవరూ ఆదరించరు.మనం మనలానే ఉండాలి.
బిగ్ బాస్ షో నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది.ముఖ్యంగా నాకు సినిమాల్లో మొదటి అవకాశం ఇచ్చిన నాగార్జున గారు హోస్ట్ గా మెప్పించారు.
షో సక్సెస్ లో ఆయన పాత్ర ఎంతో ఉంది.ఒక మాస్టర్ వలె ప్రతి వారం ఆయన కంటెస్టెంట్స్ తప్పు ఒప్పులు చెప్పడం, సరి చేయడం బాగుంది.
నేను ఎవరి దగ్గర తగ్గను.నాగార్జున బాబుతో మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఆచి తూచి మాట్లేడేవాడిని.
ఆయన విషయంలో నేను తగ్గి ఉన్నాను.కొందరు స్టార్ మా శివాజీనీ పక్కన పెట్టింది.
ప్రశాంత్ కి టైటిల్ ఇచ్చారని అంటున్నారు.అది నిజం కాదు.
ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే విజేతను నిర్ణయిస్తారు.పల్లవి ప్రశాంత్ నాబిడ్డ.
వాడు టైటిల్ గెలవడం నాకు ఎంతో సంతోషం.నేను రైతు కుటుంబం నుండే పరిశ్రమకు వచ్చాను.
వాడు కూడా రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టాడు.ఒక కామనర్ ఎప్పుడూ ఓడిపోతూ ఉంటాడు.
పల్లవి ప్రశాంత్ కామనర్ గా హౌస్లో అడుగుపెట్టి గెలిచాడు.యావర్, ప్రశాంత్ నాకు దగ్గరయ్యారు.
మేము స్నేహం చేశాము.కలిసి ఆడటం అనేది బిగ్ బాస్ నియమాలకు విరుద్ధం.
ఆ పని మేము చేయలేదు.వారిద్దరినీ నేను ప్రోత్సహించాను అంతే.
నాపై ప్రేమ కురిపించి ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు.మిమ్మల్ని నేను త్వరలో కలుస్తాను అని చెప్పుకొచ్చాడు శివాజీ.