కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.కేటీఆర్ కు పాలనానుభవం లేక అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు ఎవరు పలికిస్తున్నారో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలని మంత్రి పొన్నం తెలిపారు.ప్రభుత్వం ఏర్పడి వారం గడవకముందే పథకాలు అమలు అవడం లేదనడం సరికాదన్నారు.
త్వరలోనే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని వెల్లడించారు.పార్లమెంట్ పై దాడి బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు.
పార్లమెంట్ పై దాడిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.







