స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను ఏపీ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఆర్థిక పరమైన నేరంతో పాటు అంతరాష్ట్ర సమస్యలు ఉన్నాయన్న నేపథ్యంలో సీబీఐతో విచారించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.కాగా ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో బయట ఉన్నారన్న సంగతి తెలిసిందే.







