మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా మరో నెల రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.సంక్రాంతి కానుకగా రిలీజైన మహేష్ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో గుంటూరు కారం మూవీ కూడా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) ఎంపిక కాగా గుంటూరు కారం సినిమాతో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరతానని ఆమె భావిస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి మహేశ్ బాబు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని అన్నారు.మహేశ్ బాబు సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారని ఆమె కామెంట్లు చేశారు.
నేను గుంటూరు కారం( Guntur Kaaram ) సెట్ లోకి వచ్చిన మొదటిరోజు టెన్షన్ పడ్డానని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.
ఫస్ట్ షాట్ లోనే మహేశ్ తో కలిసి పని చేశానని ఆమె అన్నారు.ఆ సమయంలో నేను కంగారు పడటంతో మహేశ్ బాబు టెన్షన్ పడవద్దని కొంచెం టైమ్ తీసుకోండని చెప్పారని ఆమె కామెంట్లు చేశారు.ఏం కాదంటూ మహేశ్ బాబు( Mahesh Babu ) కూల్ గా మాట్లాడారని మీనాక్షి చౌదరి అన్నారు.
మీనాక్షి చౌదరి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
మీనాక్షి చౌదరి రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న మీనాక్షి చౌదరి తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.త్వరలో గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది.
ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.
.