తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) బిజెపి 11 స్థానాల్లో పోటీ చేయగా, ఎనిమిది స్థానాల్లో జనసేన పొత్తులో భాగంగా పోటీ చేసింది.అయితే జనసేన అన్ని స్థానాల్లోనూ ఓటమి చెందగా, బిజెపి పోటీ చేసిన 111 స్థానాల్లో ఎనిమిది స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది.
అసలు బీఆర్ఎస్ , కాంగ్రెస్ ( BRS, Congress )లకు ధీటుగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమాను పోలింగ్ ముందు వరకు వ్యక్తం చేస్తూ వచ్చిన బిజెపి, ఎన్నికల ఫలితాలు తర్వాత తీవ్ర నిరాశ చెందింది.తెలంగాణతో పాటు మిగతా మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపొందినా , తెలంగాణలో ఫలితాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి .ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారట.ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ఆలోచనలో కిషన్ రెడ్డి( Kishan Reddy ) ఉన్నట్లు సమాచారం.
లోక్ సభ ఎన్నికల వరకు పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డినే చూడాలని అధిష్టానం చెబుతున్నా… కిషన్ రెడ్డి మాత్రం అందుకు అంగీకరించడం లేదట.

అసలు తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించక ముందే ఈ విషయంపై షరతులు పెట్టారని , అసెంబ్లీ ఎన్నికలు ( Assembly elections )ముగిసే వరకే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పానని, ఇప్పుడు ఆ తంతు పూర్తి కావడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట.ఇటీవల తెలంగాణతో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ , ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల నియామకం చేపట్టే విషయంలో బిజెపి అధిష్టానం బిజీగా ఉండడంతో పాటు, పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నందున ఈ హడావుడి తగ్గిన తర్వాత తన పదవి విషయంలో బిజెపి( bjp ) అగ్ర నేతల వద్దే క్లారిటీ తీసుకోవాలనే ఆలోచనలో కిషన్ రెడ్డి ఉన్నారట.

ఈ నేపథ్యంలో తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతలు మళ్లీ బండి సంజయ్ కు కానీ, లేక ధర్మపురి అరవింద్ కి కానీ అప్పగించే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉందట.అయితే ఈ విషయంలో కిషన్ రెడ్డితో పూర్తిగా చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.







