మిజోరం కౌంటింగ్ ఎన్నికల తేది మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..!!

దేశంలో తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛతీస్ గడ్, మిజోరాంలో పోలింగ్ ముగియగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ ముగియటం జరిగింది.

 Announcement Of Central Election Commission Changing The Date Of Mizoram Countin-TeluguStop.com

తెలంగాణ( Telangana ) మినహా మిగతా రాష్ట్రాలలో పలు దశలలో ఎన్నికలు జరిగాయి.కాగా తెలంగాణలో ఒకే ఒక దశలో నవంబర్ 30వ తారీకు పోలింగ్ జరిగింది.

అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో… డిసెంబర్ మూడో తారీకు ఒకేసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) ప్రకటించడం జరిగింది.

కానీ లేటెస్ట్ గా కేంద్ర ఎన్నికల సంఘం మిజోరం ఎన్నికల ఫలితాలు( Mizoram Elections Results ) డిసెంబర్ 4వ తారీఖు ఓట్ల లెక్కింపు ఉండబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

మిగతా నాలుగు రాష్ట్రాల కౌంటింగ్ ప్రక్రియ యధావిధిగా ఈ నెల 3న జరగనుందని ఈసీ స్పష్టం చేయడం జరిగింది.మిజోరంలో 40 స్థానాలకు ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ 21.రావాలి.ఈ క్రమంలో మిజోరాంలో జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి స్పష్టమైన ఆదిక్యం రాకపోవటంతో మిజారాంలో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠ భరితంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube