ఈనెల 30న నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాలకు సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్ ఈనెల 30న నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలకు వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా అవుకు రెండో టన్నెల్ ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.

 Cm Jagan To Nandyala And Ysr Districts On 30th Of This Month..!-TeluguStop.com

తరువాత కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు.ఈ మేరకు 30వ తేదీ ఉదయం 10 గంటలకు ముందుగా అవుకు మండలం మెట్టుపల్లికి వెళ్లనున్నారు.

అక్కడి నుంచి రెండవ టన్నెల్ సైట్ కు చేరుకోనున్న సీఎం జగన్ నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్ ను జాతికి అంకితం చేయనున్నారు.ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన అనంతరం ఫైలాన్ ను ఆవిష్కరిచనున్నారు.

తరువాత కడపకు వెళ్లనున్న సీఎం జగన్ పెద్ద దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొననున్నారు.అనంతరం తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube