సాధారణంగా ముఖ చర్మం కాస్త డార్క్ గా ఉంటే.తెల్లగా, కాంతివంతంగా మార్చుకోవాలని చాలా మంది కోరుకుంటారు.
ఆ కోరికను తీర్చుకునేందుకు కొందరు తెగ ప్రయత్నిస్తుంటారు.చర్మం పై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
ఖరీదైన క్రీమ్, సీరం లను కొనుగోలు చేసి వాడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా రోజు ఇంట్లో మిగిలిపోయిన రైస్( Rice ) తో చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.
అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు మిగిలిపోయిన రైస్ వేసుకోవాలి.
అలాగే రెండు స్పూన్లు పచ్చి పాలు మరియు అర కప్పు బంగాళదుంప జ్యూస్( Potato Juice) వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు చేతులకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం చర్మాన్ని సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
రోజుకు ఒకసారి కనుక ఈ రెమెడీని పాటిస్తే చర్మం ఎంత నల్లగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే తెల్లగా కాంతివంతంగా మారుతుంది.స్కిన్ స్మూత్ అండ్ షైనీ గా మెరుస్తుంది.
టాన్ రిమూవ్ అవుతుంది.డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.
చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలని భావించే వారికి ఇది బెస్ట్ రెమెడీగా చెప్పుకోవచ్చు.పైగా ఈ రెమెడీని పాటిస్తే స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది.
ముడతలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి. స్కిన్ గ్లోయింగ్( Glowing skin ) గా సైతం మెరుస్తుంది.