పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్సచుకున్నారు.విజయదశమి పర్వదినాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

 Chief Justice Of The Supreme Court Visited Padmavati Amma, Supreme Court , Chief-TeluguStop.com

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కు టీటీడీ జె ఈ ఓ వీరబ్రహ్మయ్య, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్వాగతం పలుకగా, ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు.

మహాద్వారం వద్ద అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.

ధ్వజస్తంభానికి నమస్కరించి అమ్మావారి ని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.  దర్శన అనంతరం వేదాశీర్వాద మండపం లో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు అమ్మావారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం మీడియా తసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాట్లాడుతూ, ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.విజయదశమి పర్వదినాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాన ని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube