ప్రస్తుత కాలంలో యూట్యూబ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇతర యాప్స్ వాడకం తెలియని వాళ్లు సైతం యూట్యూబ్ ను వాడటానికి ఎంతగానో ఇష్టపడతారు.
అయితే కొంతమంది సామాన్యులను యూట్యూబ్ సెలబ్రిటీలను చేసింది.యూట్యూబ్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన వాళ్లలో సుహాస్ ఒకరు కాగా సుహాస్ కెరీర్ తొలినాళ్లలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు.సుహాస్ పారితోషికం ప్రస్తుతం 2.5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) కూడా యూట్యూబ్ ద్వారా క్రేజ్ ను పెంచుకుని ప్రస్తుతం బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు.రాబోయే రోజుల్లో పల్లవి ప్రశాంత్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో గంగవ్వ కూడా ఒకరు.బిగ్ బాస్ షో గంగవ్వ స్థాయిని మరింత పెంచింది.

యూట్యూబ్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని అందుకున్న వాళ్లలో షణ్ముఖ్ జశ్వంత్( Shanmukh Jaswanth ) ఒకరు.షణ్ముఖ్ కు యూట్యూబ్ లో ఏకంగా 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.షణ్ముఖ్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీ స్టేటస్ ను అందుకున్న వాళ్లలో హర్షసాయి ఒకరు.హర్షసాయికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు.

శిరీష(బర్రెలక్క) ( Sirisha )కూడా యూట్యూబ్ ద్వారా పాపులారిటీని పెంచుకున్నారు.వైవా హర్ష కూడా యూట్యూబ్ ద్వారా క్రేజ్ ను పెంచుకున్నారు.ఆదిరెడ్డి కూడా యూట్యూబ్ ద్వారా సంచలనాలు సృష్టిస్తూ సెలబ్రిటీ స్టేటస్ ను అందుకున్నారు.
రాబోయే రోజుల్లో మరి కొందరు సైతం యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సంపాదించుకుని కెరీర్ పరంగా సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.యూట్యూబ్ ద్వారా ఈ సెలబ్రిటీలకు భారీ స్థాయిలో ఆదాయం దక్కుతోంది.







