కరీంనగర్ జిల్లాలోని బహుదూర్ ఖాన్ పేట, తాహెర్, కొండాపూర్ లలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ కు ఆయన ఛాలెంజ్ విసిరారు.
బియ్యం టెండర్లలో గోల్ మాల్ పై ప్రమాణం చేయడానికి సిద్దమా అని బండి సంజయ్ ప్రశ్నించారు.ఈ మేరకు రూ.1,300 కోట్లు గోల్ మాల్ జరిగిందని తాను నిరూపిస్తానన్నారు.అలాగే రేషన్ బియ్యం, వడ్ల కొనుగోలు పైసలన్నీ కేంద్రానివేనని నిరూపిస్తానని తెలిపారు.
పంట నష్టపోయిన రైతులు గోస పడుతుంటే పంజాబ్ వాళ్లకు పైసలిస్తారా అని మండిపడ్డారు.ఈ క్రమంలోనే తన ఆస్తులన్నీ ఈ క్షణమే ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
మంత్రి గంగులకు తన ఆస్తులను ప్రజలకు రాసిచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు.







