ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ భారత్( Australia vs India ) మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.తాజాగా భారత జట్టు కొత్త కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి అవి ఏమిటో చూద్దాం.ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు గెలవకపోవడం చాలా బాధాకరం.
భారత్ టైటిల్ గెలవకపోయినా లీగ్ దశ నుండి భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిందని సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు.
వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టును రోహిత్ శర్మ( Rohit Sharma ) ముందుండి చాలా అద్భుతంగా నడిపించాడని రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా అద్భుతమని సూర్య చెప్పాడు.రోహిత్ శర్మ కెప్టెన్సీ లాగే తాను కూడా భారత జట్టును( Team India ) ముందుండి నడిపిస్తానని, భారత జట్టుకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటానని, తాను వ్యక్తిగత రికార్డుల కోసం ఆశపడనని, భారత జట్టు విజయం కోసమే కృషి చేస్తానని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్( T20 World Cup ) 2024 ముందు జరుగుతున్న ఈ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సీరీస్ చాలా కీలకం అని తెలిపాడు.ప్రస్తుతం టీ20 ఆడే భారత జట్టులో ఉండే ఆటగాళ్లను నిస్వార్ధంగా, జట్టు ప్రయోజనాల కోసమే ఆడమని తాను చెప్పినట్టు పేర్కొన్నాడు.వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్లను చాలా గట్టిగా ఢీకొట్టేందుకు భారత జట్టులో ఉండే యువ ఆటగాళ్లంతా చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.
విశాఖపట్నం వేదికగా నేడు రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టీ20 పోరు ఉత్కంఠ భరితంగా జరగనుంది.